ఎడారిలో సెలయేర్లు - మార్చి 18
యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు (మార్కు 15:5).
📖తన మీద అతి నికృష్టంగా నేరారోపణ చేసే మనుషులకి రక్షకుడై యేసు ఏ జవాబు ఇవ్వకపోవడం అనే ఈ దృశ్యంకంటే హృద్యమైన దృశ్యం బైబిల్లో మరోటి లేదు.
👉 తన దివ్యశక్తితో ఒక్క మాటతో వాళ్ళందరినీ తన పాదాల దగ్గర సాష్టాంగపడేలా చెయ్యగల సమర్ధుడే ఆయన. అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చెయ్యనిచ్చాడు. దేవుని పరిశుద్ధ గొర్రెపిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు.
-
🔹 నిలకడగా ఉండడంలో శక్తి ఉంది.
-
🔹 దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది అది.
-
🔹 మనం తొణకకుండా ఉండేలా సహాయపడుతుంది.
-
🔹 అన్ని తాపత్రయాలనుండి స్వార్థాపేక్షల నుండి బయటపడేస్తుంది.
-
🔹 అది జ్ఞానాన్నీ, ముందు చూపునీ మనలో ఉంచుతుంది.
-
🔹 మనకి తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది.
-
🔹 ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనుపరుస్తుంది.
ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రక్కకి నెట్టి మనం జోక్యం కలుగజేసుకుంటూ ఉంటాము. మనల్ని మనమే సంరక్షించుకో జూస్తాము. దేవా ఈ మౌనబలాన్ని మాకనుగ్రహించు. జయించే ఆత్మని దయచెయ్యి.
యేసు ఒంటరిగా నిలిచిన రోజు మనుషులు పాషాణ హృదయులైన రోజు దురిత విమోచన జరిగిన రోజు ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు
దొంగ సాక్ష్యాలు పలికిన రోజు పెడరెక్కలు విరిచి కట్టిన రోజు రారాజా శుభమని అపహసించిన రోజు ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు
ఆయనపై ఉమిసిన రోజు యెరూషలేమంతా ఈడ్చుకువెళ్ళిన రోజు అవమానములే చేసిన రోజు ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు
మిత్రమా చీటికీ మాటికీ ప్రతి చిన్నదానికీ చిర్రుబుర్రులాడుతున్నావా?కోపం తెచ్చుకుంటున్నావా ప్రతి రోజు? నీ రాజు మౌనంగా ఉన్నాడు ఆ రోజు
మిన్నెసొటా బిషప్ అయిన విపిల్ గారిని ‘రెడ్ ఇండియన్ల అపొస్తలుడు’ అని పిలుస్తారు. ఆయన ఈ మాటలు చెప్పాడు.
‘నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళలో సైతం దేవుడిని చూడగలగడానికి నాకు ముప్పయి సంవత్సరాలు పట్టింది”
👉 ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది. పగతీర్చుకునే స్వభావమూ, ప్రతీదాన్ని పట్టించుకుని గిల్లికజ్జాలు పెట్టుకునే స్వభావం పోతుంది. మనుషుల నాశనానికి గాక, రక్షణకే వచ్చిన యేసు ప్రభువు సాక్షులుగా మనం స్థిరపడతాము.